టీడీపీ దాడిలో చూపుకోల్పోయిన కానిస్టేబుల్‌.. ఆదుకున్న సీఎం?

Chakravarthi Kalyan
ఇటీవల చంద్రబాబు పుంగనూరులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి పోలీసులపై దాడి చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 13 మంది పోలీసులు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో గాయపడిన ప్రతీ కుటుంబానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ దాడుల్లో చూపు కోల్పోయిన కానిస్టేబుల్‌ రణధీర్‌కు సీఎం జగన్‌ పది లక్షలు ఎక్స్‌గ్రేషియా స్వయంగా ప్రకటించారు.


చంద్రబాబు నాయుడు పుంగనూరు టూర్ ఘర్షణలకు కేంద్రంగా మారింది. అంగళ్లులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెలుగుదేశం, వైసిపి వాళ్ళు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు తానే స్వయంగా పుంగనూరు కి వస్తానని, ఎవరు ఏం చేస్తారో చూస్తానని అనడం సీన్ మరింత సీరియస్‌ అయ్యింది. ఇక పుంగనూరు శివార్లలో  తెలుగుదేశం పార్టీ శ్రేణులు డైరెక్ట్ గా పోలీసుల పైనే దాడులు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: