జనం ఫుల్గా విమానాలు ఎక్కేస్తున్నారుగా?
ఈ ఏడాది మార్చిలో 53.29లక్షల మంది విదేశాలకు ప్రయాణాలు చేయగా, ఏప్రిల్ నుంచి మార్చి వరకు గత ఆర్థిక ఏడాదిలో 5.69 కోట్ల మంది విదేశాలకు రాకపోకలు సాగించారని లెక్కలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆరు విమానాశ్రయాల నుంచి గత ఆర్థిక సంవత్సరం 2.54 కోట్లు మంది ప్రయాణించారట. ఒక్క శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 2.09 కోట్లు మంది ప్రయాణించినట్లు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా లెక్కలు చెబుతున్నాయి. సూపర్ కదా.