పవన్‌తో పొత్తు.. సోము వీర్రాజు సంచలనం?

Chakravarthi Kalyan
ఏపీలో పొత్తుల విషయంపై ఇంకా క్లారిటీ రావట్లేదు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక చీలకుండా ఉండటం పై బిజెపి పెద్దలతో పవన్ తన వైఖరి చెప్పారని.. ఏపీ బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. జనసేన బిజెపి పొత్తుతో ఉన్నామని... పొత్తు విషయంలో మాకు స్పష్టత ఉందని ఏపీ బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు అంటున్నారు. పొత్తుల విషయాల్లో ఏం జరగాలో అది జరుగుతుందని.. జనసేన ఎన్డీఏ లో ఉందని ఏపీ బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

నాలుగేళ్ళ క్రితమే కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి రావాలని నేను, కిషన్ రెడ్డి ఆహ్వానించామన్న ఏపీ బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు..  కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికపై ఆనందం వ్యక్తం చేస్తున్నానన్నారు. కిరణ్ రాకతో ఏపీ తెలంగాణ లో బిజెపిని బలోపేతం అవుతుందని.. 2024 ఎన్నికల నాటికి ఏపీలో బిజెపిని బలోపేతం చేసే అంశం పై కిరణ్ కుమార్ రెడ్డి తో చర్చించానని సోము వీర్రాజు అన్నారు. రెండు రాష్ట్రాల్లో... దక్షిణాది రాష్ట్రాల్లో కిరణ్ కుమార్ రెడ్డి సేవలు ఉపయోగించుకుంటామని.. ఢిల్లీ పర్యటనలో బిజెపి పెద్దలు, కేంద్రమంత్రులను కలుస్తామని సోము వీర్రాజు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: