వదలను జగన్.. చంద్రబాబు శపథం?
5ఏళ్ల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడే ఉంటే ప్రజలకు ఇక భవిష్యత్తు ఉండదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారుల్ని బోనెక్కించకుండా వదలనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు శపథం చేశారు. అన్ని శక్తులు కూడగట్టుకుని చేసే పోరాటం లో న్యాయవాదుల పాత్ర కీలకమన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు .. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి అమరావతి పై అసత్య ఆరోపణలు చేశాడన్నారు. నరేగా పనులు చేసిన వారికి బిల్లులు ఇప్పించటంలోనూ న్యాయవాదుల కృషి కీలకమని.. న్యాయవాదుల కృషి లేకుంటే ఎందరో ఆత్మహత్యలు చేసుకునేవారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు.