వదలను జగన్.. చంద్రబాబు శపథం?

Chakravarthi Kalyan
పొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు  అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం పరాకాష్టకు చేరిందని.. ఒక్క విశాఖలోని 40వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు  విమర్శించారు. మెడపై కత్తిపెట్టి ఆస్తులు రాయించుకుంటుంటే ఇక పెట్టుబడులు ఎక్కడ నుంచి వస్తాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు  ప్రశ్నించారు.

5ఏళ్ల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడే ఉంటే ప్రజలకు ఇక భవిష్యత్తు ఉండదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు  అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారుల్ని బోనెక్కించకుండా వదలనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు శపథం చేశారు. అన్ని శక్తులు కూడగట్టుకుని చేసే పోరాటం లో న్యాయవాదుల పాత్ర కీలకమన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు .. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి అమరావతి పై అసత్య ఆరోపణలు చేశాడన్నారు. నరేగా పనులు చేసిన వారికి బిల్లులు ఇప్పించటంలోనూ న్యాయవాదుల కృషి కీలకమని.. న్యాయవాదుల కృషి లేకుంటే ఎందరో ఆత్మహత్యలు చేసుకునేవారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: