బాబుకు మోదీ ఆహ్వానం.. టీడీపీలో పరవశం?
భారత్ లో నిర్వహించే జీ -20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో చర్చించాలని ప్రధాని నిర్ణయించారు. ఇందుకు ప్రధాని, రాష్ట్రపతి భవన్ లో 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం వచ్చింది. చంద్రబాబుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషీ ఆహ్వానం పంపారు. సమావేశ ప్రాధాన్యతను చంద్రబాబుకు వివరించి హాజరు కావాల్సిందిగా ఆయన ఫోన్ చేసి కోరారు.