ఇంట్రస్టింగ్గా శివసేన గ్రూప్ ఫైట్.. బాణం గురి తప్పిందా?
ఈ నియోజకవర్గంలో షిండే వర్గం మద్దతుతో బీజేపీఅభ్యర్థి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు. అందుకే ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్థికి కొత్త పేరు, గుర్తుతో పోటీ చేసే అవకాశముంది. అందుకే గుర్తుపై.. త్వరగా నిర్ణయం తీసుకోవాలని, సీఎం ఏక్ నాథ్ షిండే గురువారం ఈసీకి లేఖ రాశారు. పార్టీ గుర్తు ‘విల్లు-బాణంను తమకు కేటాయించాలని కోరారు. ఈ విషయంపై ఇరువర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న ఎన్నికల సంఘం పార్టీ గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేసింది.