ఆకలి రాజ్యం.. ఎంత దారుణ పరిస్థితులో..?
మొత్తం 700 కోట్ల జనాభాలో దాదాపు 100 కోట్ల మందికి ఇంకా ఆకలి బాధతో ఇబ్బందులు పడుతున్నారట. ఇక చాలా మందికి ఆహారం దొరుకుతున్నా అది ఆరోగ్య కరమైన ఆహారం కాకపోవడం మరో విషాదం. ఇక మన దేశం విషయానికి వస్తే.. పౌష్టికాహారం కొనలేని స్థితిలోనే దేశంలో 70 శాతం మంది ఉన్నారని.. ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడించింది.
2030 నాటికి ఆకలి సమస్యను అధిగమించాలని గతంలో ఐక్య రాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకుంది. కానీ.. ఆ లక్ష్యం నెరవేరే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. అంతే కాదు.. ఏటా ఆకలితో అలమటించే వారి సంఖ్య పెరుగుతోందని ఐక్య రాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.