జీతం రూ.2 కోట్లు.. భద్రాద్రి కుర్రాడి జాక్‌పాట్‌?

Chakravarthi Kalyan
యువత అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. దేశ విదేశాల్లో అత్యున్నత ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ కుర్రాడు ఏకంగా ఏడాదికి రెండు కోట్ల రూపాయలు జీతంగా ఉద్యోగం సంపాదించాడు. అశ్వాపురంలోని గౌతమీనగర్‌కు చెందిన అభిరాం రెడ్డి అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇంటెల్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అతడి వార్షిక వేతనం రూ.2 కోట్లుగా ఉంది. ఇంత భారీ వేతనంతో ఆ కుర్రాడు కొలువు సాధించాడు.

అభిరాం రెడ్డి  గౌతమీనగర్‌లోని అణుశక్తి కేంద్ర పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత అభిరాం రెడ్డి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మెసాచుసెట్స్‌ లో పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. అక్కడే అదే రంగంలో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశాడు. మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో పోస్ట్‌ డాక్టరేట్‌ కూడా పూర్తి చేశాడు. ఈ నెలలో అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇంటెల్‌ కంపెనీలో రీసెర్చ్‌ సైంటిస్టుగా ఉద్యోగం సంపాదించాడు. రూ.2 కోట్ల వార్షిక వేతనంతో రీసెర్చ్‌ సైంటిస్టుగా అభిరాం రెడ్డి ఉద్యోగం దక్కించుకోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: