రాష్ట్రపతిగా ద్రౌపది.. మోదీ మరో సాహసం?
గతంలో ఎస్సీలకు రాష్ట్రపతి పదవి కట్టబెట్టిన ప్రధాని మోడీ.. ఇప్పుడు ఎస్టీలకు ఆ అవకాశం ఇవ్వడం ద్వారా బడుగుబలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పుకునే అవకాశం కలిగింది. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా అవకాశం దక్కని గిరిజనులకు.. అందులోనూ గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవి అవకాశం ఇవ్వడం నిజంగా అభినందనీయమే. రాష్ట్రపతిగా ఇప్పటి వరకూ కేవలం ఒకే ఒక్క మహిళ ప్రతిభా పాటిల్ పని చేశారు. ముర్ముకు ఇప్పుడు రెండో మహిళగా అవకాశం దక్కింది.