బాబు బంపర్ ఆఫర్‌: టీడీపీ కార్యకర్తలకు మాత్రమే?

Chakravarthi Kalyan
ఇప్పటికీ పార్టీ నిర్మాణంలోనూ.. క్యా డర్‌ మెయింటైన్‌లోనూ టీడీపీ ట్రాక్ రికార్డు సూపర్‌గా ఉంటుంది. కార్యకర్తల కోసం అనేక పథకాలు నిర్వహిస్తున్న పార్టీ ఇది. ఇప్పుడు తాజాగా టీడీపీ కార్యకర్తల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ న్యూట్రిఫుల్  పేరుతో ఓ  యాప్ తీసుకొచ్చింది.ఈ యాప్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఇక రాష్ట్రంలో వైకాపా పని అయిపోయిందనీ.. జరగబోయే ఎన్నికలు ఏకపక్షమే నని ధీమా వ్యక్తం చేశారు.


అసలు ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని చంద్రబాబు  తెలిపారు. పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించిన  చంద్రబాబు .. పార్టీలో గ్రూపులకు చెక్ పడాల్సిందేనని హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవన్నారు. కార్యకర్తల్లో కసి, పాలనపై ప్రజల అసంతృప్తే మహానాడు గ్రాండ్ సక్సెస్ కు కారణమని చంద్రబాబు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: