వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ విరాళాల లెక్కలు చూస్తే షాకే?
వాటిని బట్టి చూస్తే.. గతేడాది అంటే 2020-21ఈ ఆర్థిక సంవత్సరంలో వైసీపీకి రూ.107.89 కోట్ల విరాళాలు వచ్చాయట. ఇదే సంవత్సరం టీడీపీకి మాత్రం రూ.3.25 కోట్లు మాత్రమే విరాళాలు వచ్చినట్టు లెక్కలు చూపించాయి. ఇక మరో ప్రధాన పార్టీ టీఆర్ఎస్కు రూ.37.65 కోట్ల వరకూ విరాళాలు వచ్చాయట. వీటిలో టీఆర్ఎస్ రూ.22.34 కోట్లు ఖర్చు చేసింది. 2020-21లో దేశంలోని మొత్తం 31 ప్రాంతీయ పార్టీలకు రూ.529 కోట్ల ఆదాయం వచ్చిందట.