వాళ్ల సంగతి తేల్చండి.. జగన్కు వైసీపీ ఎంపీ సవాల్?
తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చిన వారి సంగతేంటని నిలదీశారు. వారిపై అనర్హత వేటు వేయించిన తర్వాత తన గురించి మాట్లాడాలన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరి నిసిగ్గుగా తిరుగుతున్నారని రఘురామ విమర్శించారు. అలాంటి వారికి వర్తించని ఫిరాయింపు నిబంధనలు తనకు ఎలా వర్తిస్తాయని రఘురామ ప్రశ్నించారు. తాను.. పార్టీ అద్యక్షుడిగా జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని గుర్తు చేశానే తప్ప.. నియమావళికి విరుద్దంగా ప్రవర్తించలేదని అంటున్నారు.