జగన్ దగ్గర పని చేస్తే ఎంపీ సీటు గ్యారంటీనా?
గతంలో సీఎం జగన్ దగ్గర ఆడిటర్గా పని చేసిన విజయసాయిరెడ్డి.. ఆ తర్వాత ఎంపీ అయ్యారు. ఇప్పుడు మరోసారి కూడా ఆయనకు అవకాశం లభించింది. అలాగే గతంలో జగన్ ఫిజియో థెరపిస్టుగా పని చేసిన గురుమూర్తికి తిరుపతి ఎంపీ సీటు లభించింది. ఆయన ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యారు. ఇక తాజాగా జగన్ కేసులు వాదిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డికి ఇప్పుడు రాజ్యసభ సీటు దక్కింది.