పెద్దిరెడ్డికి చంద్రబాబు వార్నింగ్‌?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. చిత్తూరు పర్యటనలో భాగంగా  చంద్రబాబు నాయుడు పలువురు వైసీపీ బాధిత నాయకులు ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల ఆగడాలు ఎక్కువౌతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోవద్దని..  రాబోయే రోజుల్లో అన్నిటికీ లెక్క కడతానని చంద్రబాబు పెద్దిరెడ్డిని హెచ్చరించారు. పుంగనూరు నియోజకవర్గం సదుంలో రాజారెడ్డి అనే వ్యక్తిని మంత్రి అనుచరులు చంపడానికి ప్రయత్నిస్తే కేసు నమోదు చేయలేదని చంద్రబాబు ఆరోపించారు. కేసు నమోదు చేయకపోగా న్యాయం చేయమని ధర్నాకు వెళ్ళిన వారిపైనే నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేస్తారా అని మండిపడ్డారు. పుంగనూరులో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని చంద్రబాబు  కోరారు. బెదిరిస్తే బెదిరిపోమన్న చంద్రబాబు.. నా ప్రాణ సమానమైన కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఎంత వరకైనా నిలబడతానని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: