ఉక్రెయిన్ యుద్ధం- ఆ దేశాలకు పెనుశాపం?
సోమాలియాతో పాటు అనేక ఆఫ్రికా దేశాలు తీవ్ర దుస్థితి ఎదుర్కొవాల్సి వస్తోంది. ఈ యుద్ధం వల్ల పెరిగిన ఆహార, ఇంధన ధరల కారణంగా ఈ దేశాల్లో 5 కోట్ల మంది సంక్షోభంలో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఆర్థిక వేత్త ఆరిఫ్ హుస్సేన్ వెల్లడించారు. అసలే కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందిపడిన ఆ దేశాలకు ఈ యుద్ధం గోరుచుట్టుపై రోకటి పోటుగా మారిందని ఆయన చెబుతున్నారు.