కేసీఆర్.. మహిళా గవర్నర్‌ను అవమానిస్తావా..?

Chakravarthi Kalyan
ఈ ఏడాది గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు వచ్చిన వార్తలు.. రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీఎం కేసీఆర్ నిర్ణయంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. కేసీఆర్‌కు ఏమైనా మతి స్థిమితం తప్పిందా అంటూ మండిపడ్డారు.

ఆయన ఏమన్నారంటే.. “ గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తున్నారని తెలుస్తుంది.. కేసీఆర్ కు మతి స్థిమితం తప్పినట్టుంది. మోదీని చుస్తే కేసీఆర్ కు ఇలా అవుతోంది.. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంగా చేసిన పనులు గవర్నర్ ప్రసంగం ద్వారా చెబుతారు. కానీ సంవత్సరం నుంచి మీరు చేసింది ఏమీ లేదు... అందుకే గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు.. ఒక మహిళ గవర్నర్ అని చూడకుండా గవర్నర్ ను అవమానిస్తారు. మీరు.. రాజ్యాంగ పదవిని అవమాన పరుస్తున్నారు..” అంటూ రాజాసింగ్ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: