హైదరాబాద్ నుంచి మియన్మార్ స్మగ్లింగ్.. ఏంటో తెలుసా..?
మరి ఇంకేంటి.. తల వెంట్రుకలు.. అవును నిజమే.. హైదరాబాద్ నుంచి మియన్మార్కు తల వెంట్రుకలు స్మగ్లింగ్ చేస్తున్న కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు కోసం హైదరాబాద్ నుంచి మియన్మార్ సరిహద్దు వరకు పలుచోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. మిజోరం మీదుగా అక్రమంగా వెంట్రుకలు తరలిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో రూ.1.20 కోట్లు, డైరీలు, కొన్న పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం లో మొత్తం 139 బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారు కూడా.