కోవిడ్ సేఫ్ ఎన్నికలు నిర్వహిస్తాం : సీఈసీ
ఎన్నికలు నిర్వహించే 5 రాష్ట్రాల్లో 2,15,368 పోలీంగ్ కేంద్రాలు ఉన్నాయని, 24.5 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారని సీఈసీ సుశీల్ చంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. కరోనా కారణంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యను తగ్గించినట్టు తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్లో నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించనున్నట్టు వివరించారు. రోనా తీవ్రత కారణంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఆరోగ్యశాఖ అధికారులతోనూ సంప్రదింపులు చేసారు. కరోనా కేసులు పెరుగుతున్నందున కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్టు సీఈసీ పేర్కొన్నారు.