కోవిడ్ సేఫ్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాం : సీఈసీ

N ANJANEYULU
ఈ సంవ‌త్స‌రం ప్ర‌థ‌మార్థంలో ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉన్న‌ది. మార్చితో గోవా, పంజాబ్‌, మ‌ణిపూర్ రాష్ట్రాల‌కు పాల‌న కాలం ముగిసిపోతుండడం.. మే నెల‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, ప్ర‌భుత్వాల పాల‌న కాలం ముగియ‌నున్న‌ది. అయితే 5 రాష్ట్రాల్లో మొత్తం 690 అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంది.  ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే 5 రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓట‌ర్లున్నారు. ఐదు రాష్ట్రాల‌లో 900 ఎల‌క్ష‌న్ అబ్జ‌ర్వ‌ర్లు ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు.
ఎన్నిక‌లు నిర్వ‌హించే  5 రాష్ట్రాల్లో 2,15,368 పోలీంగ్ కేంద్రాలు ఉన్నాయ‌ని, 24.5 ల‌క్ష‌ల మంది కొత్త ఓట‌ర్లు ఉన్నార‌ని సీఈసీ  సుశీల్ చంద్ర మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు.  క‌రోనా కార‌ణంగా పోలింగ్ కేంద్రాల్లో ఓట‌ర్ల సంఖ్య‌ను త‌గ్గించిన‌ట్టు తెలిపారు.  అభ్య‌ర్థులు ఆన్లైన్లో నామినేష‌న్ వేసేందుకు అవ‌కాశం క‌ల్పించ‌నున్నట్టు వివ‌రించారు.  రోనా తీవ్ర‌త కార‌ణంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో ప‌ర్య‌టించారు.  అక్క‌డి ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. క‌రోనా కేసులు పెరుగుతున్నందున ఆరోగ్య‌శాఖ అధికారుల‌తోనూ సంప్ర‌దింపులు చేసారు.  క‌రోనా కేసులు పెరుగుతున్నందున కొత్త నిబంధ‌న‌లు తీసుకొస్తున్న‌ట్టు సీఈసీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: