మహబూబాబాద్ జిల్లాలో పులి హల్ చల్..!
ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో పులి హల్ చల్ చేసి.. గూడూరు- కొత్తగూడ ఆవుల మందపై పెద్దపులి దాడి చేయడంతో రెండు ఆవులు మృతి చెందాయి. దీంతో ఆవుల గుంపు చెల్లచెదురైపోయింది. అటవీ గ్రామాల ప్రజలు పులి ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని భయంగా గడుపుతున్నారు. ముఖ్యంగా గూడురు మండలం నేలవంచ, కార్లాయి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ఆవుల మంద మేతకు వెళ్లినది. ఈ మందపై ఒక్కసారిగా పులి దాడి చేయడంతో రెండు ఆవులు మృతి చెందడంతో స్థానికుల్లో భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే అధికారులు పులి కోసం మూడు బృందాలుగా గాలింపులు చేపడుతున్నట్టు వెల్లడించారు.