లోయర్ మానేరు డ్యాంలో యువతి మృతి

N ANJANEYULU
దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు జ‌రుగుతున్న త‌రుణంలో   తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఓ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. ఇటీవ‌ల రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం తార‌మ‌తిపేట‌లో భ‌ర్త‌కు మ‌ద్యం తాపించి భార్య‌పై అత్యాచారానికి పాల్ప‌డి.. హ‌త్య చేసిన విష‌యం విధిత‌మే. అయితే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యాంలో గుర్తు తెలియని ఓ యువతి మృతదేహం లభ్యం కావడంతో  కలకలం సృష్టిస్తున్న‌ది.
ఆ  యువతి ఆత్మహత్యకు పాల్పడిన‌దా?  లేక ఎవరైనా ఎక్కడైనా హత్యచేసిన లోయర్ మానేరు డ్యాంలో పడేశారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్ప‌టికే ఆ  యువతికి సంబంధించిన  వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. యువతి ఎప్పుడు మరణించిందని,  ఎలా మరణించింది అనేది పోస్టు మార్టం రిపోర్ట్ తర్వాతే తేలనున్న‌ది. ఈ  యువ‌తి మృతి ఘటనతో లోయర్ మానేరు డ్యాం పరిసరాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.  ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన మిస్సింగ్ కేసుల ఆధారంగా కేసు దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. ఈతకు వెళ్ళి ఊపిరి ఆడ‌క మరణించిందా లేక వేరే  ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది తేలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: