ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. సీఎం జగన్ వరదలపై శ్రద్ధ పెట్టకుండా బురద రాజకీయాలు చేస్తూ ఎదుటి వారిపై బురద చల్లే ప్రయత్నం చేయడం సిగ్గు చేటని మండపడ్డారు అచ్చెన్నా. జగన్కు కుప్పంలో దొంగ ఓట్లు వేయించడంపై ఉన్న శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవడంలో లేదు అన్నారు. ఇప్పటికైనా బురద జల్లే రాజకీయాలు మానుకొని వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.
చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని అచ్చెన్నా కోరారు. రాష్ట్రంలో వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయని, రైతులు పంట నష్టంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వేల ఎకరాల్లో పంట నష్టం, ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుందని వివరించారు. రైతులు ఆరుగాలం పాటు శ్రమించి చేతికి అందిన పంట నీటిలో మునగడం అన్నదాతల ఆవేదన, ఆందోళన చెందుతున్నారని అచ్చెన్నాయుడు వెల్లడించారు.