కుప్పంలో టీడీపీకి షాక్‌.. కొన‌సాగుతున్న వైసీపీ హ‌వా..!

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్యంత ముఖ్య‌మైన మున్సిపాలిటీ అయిన కుప్పంలో ఎన్నిక‌ల కౌంటింగ్ ఉద‌యం 8 గంట‌ల‌కు మొద‌లైంది. మొద‌లైన‌ప్ప‌టి నుంచే వైసీపీ కాస్త ఆధిక్యంలో క‌న‌బ‌డింది. ఆ త‌రువాత టీడీపీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఉత్కంఠ‌గా కొన‌సాగుతున్న ఫ‌లితాల‌లో ప్ర‌స్తుతం వైసీపీ అభ్య‌ర్థులు ముగ్గురు విజ‌యం సాధించారు. 7 వైసీపీ అభ్య‌ర్థులు ముందంజ‌లో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అభ్య‌ర్థులు న‌లుగురు ముందంజ‌లో ఉన్నారు.

ముఖ్యంగా ఒకటో వార్డులో  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కత్తి నాగరాజు 273 ఓట్ల మెజార్టీతో, మూడో వార్డు లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి  ప్రత్యూష, నాలుగో వార్డ్ లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మాచర్ల సుప్రజా గెలుపొందారు. ఏడ‌వ‌ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షకీలా విజ‌య‌దుందుబి మోగించారు. 18వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జయంతి , 9వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యరటపల్లి శివారెడ్డిలు కూడా విజ‌యం సాధించారు.  14 వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చీర్ల ప్రసాద్, 15 వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కంట అనంతమ్మ ముందంజ‌లో ఉన్నారు. టీడీపీ నాలుగు చోట్ల ఆధిక్యంలో క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: