టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
ఐదు, ఆరో స్థానాలకు సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఉత్కంఠ మధ్య బండా ప్రకాశ్పేరు ప్రకటించారు. బండా ప్రకాశ్ ను క్యాబినేట్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. నామినేషన్ దాఖలు చేసేందుకు మంగళవారం రోజు ఆఖరు తేదీ కావడంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు కాస్త టెన్షన్ కు గురయ్యారు. 9 గంటల వరకు ప్రగతి భవన్కు చేరుకోవాలని పిలుపు వచ్చింది. దాదాపు ప్రకటించిన అభ్యర్థులందరూ 10 గంటలలోపు ప్రగతి భవన్ చేరుకున్నారు. ఆ తరువాత సీఎం కేసీఆర్ ప్రకటించిన వారికి బీఫామ్లు అందజేసారు. వారు నామినేషన్లను దాఖలు చేసేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు.