హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్ చాలా చాలా వరాలు ఇచ్చేందుకు సన్నాహా చేశారు. అదేవిధంగా శ్రేణులను స మాయత్తం కూడా చేశారు. ఈ క్రమంలో గులాబీ దండు కు వేరే పార్టీల నుంచి చేరుకున్న ఇద్దరు నాయకులకు కీలక పదవులు అని కేసీఆర్ ఎప్పుడో రాసి పెట్టి ఆ కాగితాన్ని ఓ కవర్ లో దాచి చివర్లో ఎవరు బాగా పనిచేస్తే వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, అది కూ డా గెల్లు శీను గెలుపు తరువాత ఏదో ఒకటి తేల్చిపోవాలని అనుకుంటున్నాడు కేసీఆర్. అదేవిధంగా కీలక ప్రభుత్వ పదవులు కొ న్ని, పార్టీ పదవులు కొన్ని పంపకం చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఇరవై ఏళ్ల టీఆర్ఎస్ కు ఇప్పుడివే సవాళ్లుగా మారను న్నాయి. పదవులను ఎరగా వేసి పార్టీలోకి తెప్పించుకున్న సీనియర్లను కేసీఆర్ ఎలా గౌరవిస్తారు అన్నదే పెద్ద సస్పెన్స్ గా మా రింది. అయితే హుజురాబాద్ లో ఒక వైపే ఓటరు ఉన్నాడని తేలిపోయింది కనుక పదవుల పై ఆశలు ఉంచుకున్న వారంతా ఇక పక్క పార్టీల వైపు తొంగి చూడాల్సిన టైం వచ్చేసిందనే అనుకోండిక! ఆశావాదులకు ఇంతటి నిరాశ మిగుల్చుట తగునా! కేసీఆర్...