వరి కాకుండా గంజాయి పండించాలా..? ధర్మపురి అరవింద్
హరీశ్ రావు ,కేసీఆర్ నోరు ఉన్నదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దుబాయ్కి కేటీఆర్ ఎన్నిసార్లు పోతాడో తెలియదా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఏమైంది అని, అదేవిధంగా డబల్ బెడ్ రూమ్ లను గుంతలు తీసి వదిలేశారని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కాగానే ఇందూర్ లో ఉద్యమం ప్రారంభం కాబోతోందని వెల్లడించారు. టీఆర్ఎస్ పంపించిన 20 వేలల్లో 14 వేలు ఉంచుకొని ఒక ఓటుకు 6 వేలు పంచుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి తయారు చేస్తున్నారా గ్యాస్.. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఉంటది అని చెప్పుకొచ్చారు.