వ‌రి కాకుండా గంజాయి పండించాలా..? ధ‌ర్మ‌పురి అర‌వింద్‌

N ANJANEYULU
తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గం ఉపఎన్నిక‌కు బుధ‌వారంతో ప్ర‌చారం ముగించింది. చివ‌రి రోజు కావ‌డంతో ప్ర‌చారంలో నాయ‌కులు ప్ర‌సంగాలు ఆక‌ట్టుకున్నాయి. తాజాగా నిజామాబాద్ ఎంపీ  ధ‌ర్మ‌పురి అర‌వింద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ‌రి కాకుండా గంజాయి పండించాలా అని మండిప‌డ్డారు. నిజామాబాద్ జిల్లా లో చెరుకు,పసుపు పరిశోధన కేంద్రం ఏది అని ప్ర‌శ్నించారు. కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచిత విద్య ఏమైందని, అంతర్జాతీయ స్థాయిలో అమరుల స్మృతి చిహ్నం ఏది అని అడిగారు. తెలంగాణ‌లో ఆర్టీసీని అమ్మేస్తున్నారు. జర్నలిస్టుల సంక్షేమం, ఇంటి స్థలాలు, ఇల్లు, హెల్త్ కార్డ్, భవనం ఎటుపోయాయి అని పేర్కొన్నారు.
హరీశ్ రావు ,కేసీఆర్ నోరు ఉన్నదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దుబాయ్‌కి కేటీఆర్ ఎన్నిసార్లు పోతాడో తెలియ‌దా అని ప్ర‌శ్నించారు. నిరుద్యోగుల‌కు ఇస్తామ‌న్న నిరుద్యోగ భృతి ఏమైంది అని, అదేవిధంగా డబల్ బెడ్ రూమ్ లను గుంతలు తీసి వదిలేశారని పేర్కొన్నారు. హుజురాబాద్  ఉప ఎన్నిక కాగానే ఇందూర్ లో ఉద్యమం ప్రారంభం కాబోతోందని వెల్ల‌డించారు. టీఆర్ఎస్  పంపించిన 20 వేలల్లో 14 వేలు ఉంచుకొని ఒక ఓటుకు 6 వేలు పంచుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి తయారు చేస్తున్నారా గ్యాస్.. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఉంటది అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: