టిఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ అంధకారం లోకి వెళ్తుందని కొందరు నాయకులు అన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రధేశ్ రాష్ట్రమే అంధకారంలోకి వెళ్లినట్టు కెసిఆర్ కామెంట్లు చేశారు. కరెంటు ఉత్పత్తి లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు.
ఏపీలో ఇప్పుడు కరెంట్ కోతలు ఉన్నాయని..అదే విధంగా అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి విడిపోయామని ఆ రాష్ట్రానికి ఇప్పుడు కరెంట్ లేదని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి సమిష్టి కృషి వల్లే జరిగిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడగలుగుతున్నామని కేసీఆర్ తెలిపారు. ఇదిలా ఉండగానే ఏపీ ప్రజలు దళిత బంధు పథకం కావాలంటున్నారంటూ కూడా ఆసక్తికర వ్యాక్యాలు చేశారు.