వణుకుతున్న గోదావరి జిల్లాలు...?
కూనవరం వద్ద ముఫ్ఫై తొమ్మిది అడుగులకు చేరిన వరద... మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కూనవరం మండలం కోండ్రాజుపేట కాజ్ వే పైన వరదనీరు చేరడంతో పన్నెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో సోకులేరు వాగు రహదారి పైకి చేరడంతో వి.ఆర్.పురం ,చింతూరు మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. అకాల వరదలతో వరి, మిర్చి పంటలు ముంపుకు గురవుతాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఆదుకోవాలని కోరుతున్నారు.