చెప్ప‌కుండానే చెప్పేసిన కిష‌న్‌రెడ్డి?

Garikapati Rajesh

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డులో స‌భ్య‌త్వం కోసం తాను ఎవ‌రినీ సూచించ‌లేద‌ని, తాను ఎవ‌రికీ సిఫార్సు చేయ‌లేద‌ని కేంద్ర ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి కిష‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఒక లేఖ రాశారు. తితిదే ప్ర‌త్యేక ఆహ్వానితులుగా వై.ర‌విప్ర‌సాద్ పేరును తాను సూచించ‌లేద‌న్నారు. త‌న వ్య‌క్తిగ‌తంగాకానీ, ప‌ర్యాట‌క‌శాఖ త‌ర‌ఫున‌కానీ ఎవ‌రినీ సూచించ‌లేద‌ని మ‌రోసారి మంత్రి స్ప‌ష్టం చేశారు. కోట్లాది భ‌క్తుల మ‌నోభావాల‌తో ముడిప‌డివున్న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప‌విత్ర‌త‌త‌ను దెబ్బ‌తీసేలా నేర‌స్తులు, అవినీతిప‌రులు, క‌ళంకితులను బోర్డులో ఏర్పాటుచేసి మొత్తం 81 మంది స‌భ్యుల‌తో జంబో బోర్డును ఏర్పాటు చేశారంటూ ఏపీలో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం ఆరోపిస్తోంది. తాజాగా దీనిపై మంత్రి కిష‌న్‌రెడ్డి స్పందించారు. ఆయ‌న జ‌గ‌న్‌కు రాసిన లేఖ‌తో ఒక‌ర‌కంగా కొత్త వివాదం వెలుగులోకి వ‌చ్చిన‌ట్లైంది. మంత్రి మాట‌ల‌ను న‌మ్మాలా? వ‌ద్దా? అనేది ప్ర‌జ‌ల‌కు అర్థం కాకుండా ఉంది. ఏమీ లేదంటూనే నేను ఎవ‌రినీ సూచించ‌లేదంటూ లేఖ రాయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని భ‌క్తులు ప్ర‌శ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: