ఈరోజు జ‌రిగింది ఆరంభం మాత్ర‌మే: జోగి

Garikapati Rajesh

ఏపీ ముఖ్య‌మంత్రి జగన్‌ను కన్నెత్తి చూసినా సహించేది లేదని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ నేత‌ల‌ను హెచ్చరించారు. సీఎం జగన్‌ ఇంటిపై కన్నెత్తి చూసే అర్హత తెలుగుదేశం పార్టీకి లేద‌ని మండిపడ్డారు. ఈ రోజు జరిగింది ఆరంభం మాత్రమేనని, తెలుగుదేశం శ్రేణుల‌ను అదుపులో పెట్టుకోకపోతే చంద్రబాబును ఎక్కడపడితే అక్కడ అడ్డుకుంటామంటూ జోగి  హెచ్చరించారు. ఈరోజు ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసం వ‌ద్ద ఎమ్మెల్యే జోగి ర‌మేష్ ఆధ్వ‌ర్యంలో వైసీపీ శ్రేణులు వివాదానికి దిగారు. ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద జోగితోపాటు వైసీపీ కార్య‌క‌ర్త‌లు లోప‌లికి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు అడ్డుకున్నారు. భారీసంఖ్య‌లో అక్క‌డికి చేరుకున్న పోలీసులు వారిని చెద‌ర‌గొట్టారు. ఈ క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల‌కు, వైసీపీ శ్రేణుల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. దీనిపై రాష్ట్ర‌వ్యాప్తంగా తెదేపా శ్రేణులు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాయి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇంటివ‌ద్ద పోలీసులు భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. తాడేప‌ల్లివైపు వ‌చ్చే వాహ‌నాల‌ను జాతీయ ర‌హ‌దారిపైకి మ‌ళ్లించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: