జగన్ కు బాబు లేఖ..వెంటనే రద్దు చేయండి!

Chaganti
సీఎం జగన్ కు ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు, టీటీడీ బోర్డు ఏర్పాటు విష‌యంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.  81 మందితో ttd బోర్డు ఏర్పాటు పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బతీయడమే నన్న చంద్రబాబు, బోర్డ్ లో అవినీతి పరులు, నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారని విమర్శించారు, రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసమే బోర్డ్ ఏర్పాటు చేశారని, రెండేళ్ల లో తిరుమల కొండపై అనేక అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని అన్నారు. వెంటనే సీఎం తన నిర్ణయాన్ని మార్చువాలి.... బోర్డ్ రద్దు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ నేతలు, కీలక వ్యక్తులతో ఈ బోర్డును ప్రకటించారు, బోర్డు లో శివసేన సహా అనేక ఇతర పార్టీల నాయకులకు సైతం అవకాశం కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: