వైసీపీ ఎమ్మెల్యే వర్సెస్ కర్ణాటక...?

ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో రాయదుర్గం లారీ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు వివాదాస్పదం అయింది. రాయదుర్గం లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం ఏర్పాటు వ్యతిరేకంగా బెంగళూరు - బళ్ళారి జాతీయ రహదారిపై బళ్ళారి లారీ ట్రాన్స్ పోర్ట్ ఓనర్లు ధర్నాకు దిగారు. డి హీరేహల్ ఎస్ ఐ రామకృష్ణారెడ్డి, బళ్లారి లారీ యజమానుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

ఆంధ్ర ప్రాంతంలో ఆందోళన చేయవద్దంటూ బళ్లారి లారీ యజమానులను  ఎస్సై రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఇది జాతీయ రహదారి ఆందోళన చేస్తామంటూ ఎస్.ఐ తో బళ్లారి లారీ యజమానులు  గొడవకు దిగారు. రాయదుర్గం లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం ఏర్పాటు వెనుక ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి , కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రమేయం ఉందని వార్తలు వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం రాయదుర్గం లారీ ట్రాన్స్ పోర్ట్  లోడింగ్ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: