స‌మ‌గ్ర భూ స‌ర్వే పై సీఎం కీల‌క ఆదేశాలు.. !

రాష్ట్రంలో స‌మ‌గ్ర భూస‌ర్వేపై సీఎం జ‌గ‌న్ కీల‌క ఆదేశాలిచ్చారు. జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తికావాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునే విధానంలో ముందుకు సాగాలంటూ సూచించారు. అవసరమైన పరికరాలు, వనరులను సమకూర్చుకోవాల‌ని తెలిపారు. అవసరమైన మేరకు డ్రోన్లను కొనుగోలు చేయాల‌ని సూచించారు. అంతే కాకుండా అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తీసుకోవాల‌ని సీఎం తెలిపారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియలో ఎక్కడా కూడా అవినీతికి తావు ఉండకూడదంటూ సీఎం హెచ్చిరించారు. 


ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సమగ్ర సర్వేపై తాను సమీక్షచేస్తానని సీఎం తెలిపారు. అలాగే స్పందనలో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా దీనిపై సమీక్షచేస్తానని సీఎం చెప్పుకొచ్చారు. వారానికి ఒకసారి మంత్రుల కమిటీ సమీక్ష చేయాలంటూ సీఎం ఆదేశించారు. సమగ్ర సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. సర్వే ఆఫ్‌ ఇండియా సహకారాన్ని తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: