ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి డిల్లీ వెళ్లారు.ఈ రోజు ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ని కలిశారు.కాకినాడలో పెట్రో కెమికల్ కారిడార్ని ప్రారంభిచాలని కేంద్ర మంత్రిని కోరినట్లు మేకపాటి తెలిపారు.దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని..ఏపీలో పెట్టుబడులుపెట్టేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు.32 వేల కోట్ల పెట్టుబడితో పెట్రో కెమికల్ రిఫైనరీ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.వీటితో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై కూడా చర్చించినట్లు ఆయన తెలిపారు.