సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ తెలుగు రాష్ట్రాల్లో పర్యటన కొనసాగిస్తున్నారు. సీజేఐ హోదాలో తొలిసారిగా వచ్చిన ఎన్వీ రమణకు ఇరు రాష్ట్రాలు ఘన స్వాగతం పలికాయి. తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం రాజ్భవన్ గెస్ట్ హౌస్లో ఆయన బస చేస్తున్నారు.అయితే ఎల్లుండు నల్గొండ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్దిగాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామిని చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ దంపతులు దర్శించుకోనున్నారు.ఎన్వీరమణ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.