మోసపోయేవాడు ఉన్నన్ని రోజులూ మోసం చేసేవాడు ఉంటాడన్న తీరుగా మారాయి ప్రస్తుత పరిస్థితులు. అమాయకులను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా బెజవాడలో రియల్ మాఫియా కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ పేరుతో కస్టమర్లకు కోట్లరూపాయలు టోకరా వేశారు. యం కె డెవలపర్స్ అనే పేరుతో కస్టమర్లను దారుణంగా మోసం చేశారు. బెజవాడలో ఏజెంట్స్ పేరుతో మొత్తం రూ. 6 కోట్లు వసూలు చేశారు.
కష్టమర్స్ వద్ద డబ్బులు వసూలు చేసి బోర్డ్ తిప్పేసిన పట్నాల శ్రీనివాసరావు అనే వ్యక్తి. ఇప్పటి వరకూ మొత్తం వంద మంది వరకు భాదితులు రియల్ మాఫియా చేతిలో మోసపోయారు. పట్నా శ్రీనివాసరావు పై గతంలో రాజమండ్రి,వైజాగ్ లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. మోసపోయిన వారంతా బెజవాడ పోలీసులను అశ్రయించడంతో అసలు విషయం భయట పడింది.