టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై ట్విట్టర్ వేధికగా సంచలన కామెంట్లు చేశారు. వరుస ట్వీట్లతో జగన్ సర్కార్ పై విమర్షలు కురింపించారు. రాష్ట్రానికి జగన్ పాలనలో ఒక్క కంపెనీ కూడా రాలేదని అన్నారు. టీడీపీ హయాంలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో దేశం 3,4 స్థానాల్లో ఉంటే జగన్ పాలనలో 13 స్థానంలో ఉందంటూ పేర్కొన్నారు. లోకేష్ తన ట్వీట్లో..... "గౌరవనీయులైన పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ గారూ రెండేళ్ల మీ పాలనలో ఉన్న పరిశ్రమల్ని బెదిరించి వసూలు చేసిన జే-ట్యాక్స్ (జగన్ ట్యాక్స్) 30 వేల కోట్లనే.. వచ్చిన పెట్టుబడులు అని చెప్పినట్టున్నారని పేర్కొన్నారు.
65 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని సెలవిచ్చారు. ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, ఆంధ్రా స్టార్ బ్రాందీ కంపెనీలు తప్పించి కొత్తగా వచ్చిన కంపెనీల్లేవని అన్నారు. టిడిపి ఐదేళ్ల పాలనలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఏపీ 3, 4వ స్థానాల్లో వుంటే, రెండేళ్ల జగన్ పాలనలో 13వ స్థానంలో వుందని అన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన కియా యాజమాన్యాన్ని వైసీపీ ఎంపీలే వీధిరౌడీల కంటే ఘోరంగా బెదిరించడం చూశాక ఏ విదేశీ కంపెనీ ఏపీ కి వస్తుంది? అంటూ ప్రశ్నించారు. జే ట్యాక్స్ చెల్లించని కంపెనీలపై పీసీబీని ప్రయోగించి మూయించేస్తుంటే, ఇంకెవరు కొత్తగా పెట్టుబడి పెడతారు?" అంటూ లోకేష్ ట్వీట్లతో ప్రశ్నించారు.