న‌ల్ల‌గొండ జిల్లాలో టీఆర్ఎస్‌కు రెండు రోజుల్లో రెండో గెలుపు

VUYYURU SUBHASH
న‌ల్ల‌గొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ వ‌రుస‌గా రెండు రోజుల్లో రెండో విజ‌యం సాధించింది. నిన్న‌టికి నిన్న నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో గెలిచిన కారు పార్టీ ఈ రోజు న‌కిరేక‌ల్ మున్సిపాల్టీని గెలుచుకుంది. నకిరేకల్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో టీఆర్ఎస్ 12 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 2, ఇతరులు 5 వార్డుల్లో గెలుపొందారు. ఒకటో వార్డులో 190 ఓట్లు మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థి కందాల భిక్షం రెడ్డి, రెండో వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీల్ కుమార్ 400 ఓట్ల మెజార్టీతో , నాలుగో వార్డులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గాజుల సుకన్య విజయం సాధించారు.

ఏడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి  నూరు బేగం 74 ఓట్ల మెజారిటీతో, ఎనిమిదో వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి కందాల పావని శ్రీనివాస్ రెడ్డి, పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఈ సునీత 74 , 11వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మురారి శెట్టి ఉమారాణి , 13వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సునీత, 15వ వార్డులో ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి యసారపు వెంకన్న,17వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లె విజయ్, 19వ వార్డులో రాచకొండ శ్రీను (టీఆర్ఎస్) గెలుపొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: