బెంగళూరు డ్రగ్స్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ పార్టీల్లో పాల్గొన్న పలువురికి నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసులు పలు సంచలన పేర్లు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త తో పాటు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు కూడా బెంగళూరు పోలీసులు ప్రశ్నించారు. హైదరాబాద్కే చెందిన సిద్దార్థ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఓ ఎమ్మెల్యేతో పాటు ముగురు వ్యాపారవేత్తలు ఎనిమిదిమంది ఈవెంట్ మేనేజర ఇద్దరు సినిమా హీరోలతో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చేందుకు బెంగుళూరు పోలీసుల రంగం సిద్ధం చేశారు.