పోలీస్‌స్టేష‌న్లో లొంగిపోయిన టీడీపీ కీల‌క నేత‌

VUYYURU SUBHASH
శ్రీకాకుళం జిల్లా పార్ల‌మెంట‌రీ టీడీపీ అధ్య‌క్షులు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం పొందూరు పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం ఆముదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గంలోని పెనుబర్తిలో జరిగిన కొట్లాటలో కూన రవిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ర‌వి స్వ‌గ్రామం పెనుబర్తిలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు.

ఇక్క‌డ పోలీసులు త‌మ‌పై దాడి చేసిన వారిపై కాకుండా గాయ‌ప‌డ్డ త‌మ పార్టీ నేత‌ల‌ను అరెస్టు చేసేందుకు య‌త్నిస్తున్నారంటూ కూన ర‌వి ఫైర్ అయ్యారు. పోలీసుల‌తో పాటు డీఎస్పీ తీరును విమర్శించారు. విధినిర్వహణలో వున్న డీఎస్పీ సహా పోలీసుల పట్ల దుర్భాషలాడిన ఘటనలో 29 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఈ క్ర‌మంలోనే వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ర‌వి ఈ రోజు పోలీసుల ఎదుట స‌రెండ‌ర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: