తెలంగాణలో దుకాణాలు బంద్.... క్లారిటీ ఇచ్చిన సీఎస్
ఈ పుకార్లపై సీఎస్ సోమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. రాత్రివేళ దుకాణాలు మూసివేత వార్త తప్పుడు ప్రచారమని సీఎస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ ఉండదని సీఎస్ స్పష్టం చేశారు. ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని, ఏ విషయాన్నైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని.. ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని ఆయన క్లారిటీ ఇచ్చారు.