నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

VUYYURU SUBHASH
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బాధ్య‌త‌లు స్వీక‌రించి పార్టీల‌తో ఏర్పాటు చేసిన తొలి స‌మావేశానికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్ ఇచ్చారు. ఏపీలో ఆగిపోయిన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు కొన‌సాగిస్తూ ఆమె నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకూడదని జనసేన నిర్ణయించింది.


ఈ మేరకు పార్టీ అధినేత‌ పవన్ స్వ‌యంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తూ నీలం సాహ్ని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక‌పై ఇప్ప‌టికే తాము కోర్టులో కేసులు వేసినందున ఈ స‌మావేశానికి హాజ‌రు కాకూడ‌ద‌ని జ‌న‌సేన నిర్ణ‌యించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: