దుబ్బాక ఎన్నిక వద్దంటున్న రాములమ్మ...?

తెలంగాణాలో దుబ్బాక ఉప ఎన్నికలు కాస్త హాట్ టాపిక్ గా మారాయి. ఎవరు విజయం సాధిస్తారో అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఉప ఎన్నికల విషయంలో ఇప్పుడు అధికార పార్టీ టర్గెట్ గా విపక్షాల నేతలు తీవ్ర విమర్శలు చేసారు. తాజాగా కాంగ్రెస్ నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేసారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆరెస్  అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు అని ఆమె అన్నారు.  
ఎన్నికల కోడ్ రావడానికి ముందే టీఆరెస్ ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం అనేక దుష్ప్రయోగాలు ప్రారంభించింది అని ఆమె అన్నారు. గత కొన్నిరోజులుగా మరింత బరితెగించేందుకు అధికార పార్టీ సిద్ధపడుతున్నట్టు స్పష్టమవుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ ఎన్నిక జరపడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమా కాదా అన్న సందేహాలు కూడా సమాజంలో వ్యక్తమవుతున్నాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: