తమిళనాడులో కరోనా కరాళ నృత్యం... ఢిల్లీని దాటేసిన కేసులు
దక్షిణాదిలో తమిళనాడు రాష్ట్రాన్ని కరోనా కకావికలం చేస్తోంది. కరోనా దెబ్బతో ఆ రాష్ట్రం విలవిల్లాడుతోంది. తాజాగా ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడంతో కరోనా కేసుల్లో కేసుల్లో తమిళనాడు ఢిల్లీని దాటేసింది. వైరస్ తీవ్రత దృష్ట్యా నిమిషం నిమిషానికి అక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్తో దక్షిణాదిలో తమిళనాడు, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఒక్క రోజే 3,943 వరకు కేసుల నమోదుతో మొత్తం కేసుల్లో తమిళనాడు దేశ రాజధాని ఢిల్లీని దాటేసి రెండో స్థానానికి వచ్చింది.
ఇదిలా ఉంటే దేవవ్యాప్తంగా సోమవారంతో పోలిస్తే మంగళవారం కేసులు తగ్గాయి. సోమవారం 19,459 మందికి కోవిడ్ సోకగా.. మంగళవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 18,522 మందికి పాజటీవ్గా తేలిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. దీని ప్రకారం క్రితం రోజుతో పోలిస్తే బాధితుల సంఖ్య 937 తగ్గింది.