సీఎం ఆఫీసులో మొదటి కరోనా మరణం..?

praveen

తమిళనాడు రాష్ట్రంలో కరోనా  వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. భారీ రేంజ్లో అక్కడ రోజురోజుకు పెరిగిపోతున్నాయి.దీంతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు.. అయితే కరోనా  వైరస్ ను కంట్రోల్ చేసేందుకు తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకొని నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

 

 ఇదిలా ఉంటే తాజాగా సీఎం పళనిస్వామి కార్యాలయ కార్యదర్శి కరోనా  వైరస్ బారిన పడి మృతి చెందటం  ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. సీఎం కార్యాలయ కార్యదర్శి దామోదర్ తాజాగా కరోనా  వైరస్ తో మృతి చెందారు. అయితే అత్యున్నత స్థాయి అధికారులు ఈ వ్యాధితో చనిపోవడం రాష్ట్రంలో మరింత కలకలం రేపుతోంది అని చెప్పాలి. ఇప్పటివరకు సెక్రటేరియట్లో 200 మంది వరకు ఉద్యోగులు కరోనా  వైరస్ బారిన పడ్డట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: