ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ కి జగన్ గైర్హాజరు...?

కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల సిఎం లతో చర్చిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 14 రాష్ట్రాల సిఎం లతో ఆయన మాట్లాడతారు. ఈ సమావేశ౦లో కరోనా కట్టడిపై తీసుకునే చర్యలను ప్రధాని సిఎం లతో చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి గురించి కూడా ఆయన అడిగి తెలుసుకుని పలు సూచనలు చేయనున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ సమావేశానికి ఏపీ సిఎం వైఎస్ జగన్ పాల్గొనే అవకాశ౦ లేదని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపధ్యంలో ఆయన పాల్గొనడం లేదు అని లేదా మధ్యలో వచ్చి జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. నిన్న కొందరు సిఎం లతో మోడీ మాట్లాడిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: