ప్రధాని మోడీ చెప్పిన సప్తపది.. ఏడు ముఖ్యమైన అంశాలు ఇవే..
* వయసు పైబడిన పెద్దవాళ్లను కారోనా నుంచి కాపాడుకుందాం.. అత్యవసర విధుల్లో ఉన్నవారిని గౌరవిద్దాం.. మాస్క్లు ధరించాలి.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. పేదలకు, అన్నార్తులకు మరింత సాయం చేద్దాం.. ఆరోగ్యసేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి.. సామాజిక దూరం పాటించాలి.. కరోనాను తరిమికొట్టాలి.. ఏ ప్రైవేట్ సంస్థ ఉద్యోగులపై వేటువేయొద్దు* అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సప్తపదిని వివరించారు. కరోనా వైరస్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఆర్థికం కన్నా ప్రజల ప్రాణాలే అత్యంత ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం 10గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనాపై పోరుకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి మే 3వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ 21 రోజులు ఎన్ని కష్టాలు ఎదురైనా దేశ ప్రజలు నిలబడ్డారని, ఇదే స్ఫూర్తిని ఇకముందు కూడా చూపాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్లో కరోనా వైరస్ పూర్తి నియంత్రణలో ఉందని, ఇది భారత ప్రజల విజయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. దేశంలో లాక్డౌన్ అమలుకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించారని ఆయన అన్నారు.