న‌ట‌న‌లో స‌హ‌జ‌త్వ‌మే ఆమెను ప‌రిశ్ర‌మ‌లో నిల‌బెట్టింది.. నేడు ల‌క్ష్మి జ‌న్మ‌దినం...

Spyder
అనేక భార‌తీయ భాష‌ల్లో న‌టించి మెప్పిస్తున్న లక్ష్మి ఎర్రగుడిపాటి గారికి ఎంతోమంది అభిమానులున్నారు. మిథునం సినిమాలో ఆమె ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న‌తో ఆమె అభిమానుల సంఖ్య రెట్టింప‌యింద‌నే చెప్పాలి. సినిమా రంగానికి చెందిన వై.వి.రావు, వై.రుక్మిణి ల పుత్రిక. లక్ష్మి తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో 1952, డిసెంబరు 13 న మద్రాసులో జన్మించారు. లక్ష్మి 1975లో విజయవంతమైన హిందీ చిత్రం జూలీలో ప్రధాన పాత్ర పోషించిన నటిగా ప్రసిద్ధి చెందింది. ఆ సినిమా ఎంతో విజ‌యవంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డట‌మే కాదు..  ఆ సినిమాలో లక్ష్మి నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు ద‌క్కింది. ఆ త‌ర్వాత ఎప్పుడూ సినిమా ప‌రిశ్ర‌మ‌లో వెనుదిరిగి చూడ‌లేదు.  తండ్రి వై.వి.రావు నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగు సినీ దర్శకుడు, నటుడు అనేక సాంఘిక విషయాలపై ఆధారితమైన సినిమాలను నిర్మించాడు. ఈమె తల్లి రుక్మిణి తమిళ నటి. అమ్మమ్మ నుంగబాక్కం జానకి కూడా నటే. కళాకారుల కుటుంబంలో జన్మించిన లక్ష్మి మూడవ తరము నటి. 15 యేళ్ల వయసులోనే సినీరంగంలో ప్రవేశించింది.



తొలి సినిమా 1968 లో విడుదలైన తమిళ సినిమా "జీవనాంశమ్". 1970వ దశకంలో తారగా వెలుగొందిన లక్ష్మి దక్షిణ భారత భాషలన్నింటిలో నటించింది. ఈమె నటించిన మలయాళంలో విజయవంతమైన చట్టకారి (1974) చిత్రాన్ని హిందీలో జూలీ (1975) అనే పేరుతో, తెలుగులో "మిస్ జూలీ ప్రేమకథ" (1975) గా పునర్నిర్మించి విడుదల చేశారు. జూలీ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు బెంగాళీ సినీ పాత్రికేయ సంఘం యొక్క "సంవత్సరపు ఉత్కృష్ట నటన" పురస్కారాన్ని అందుకున్నది. జూలీ చిత్రం యొక్క విజయం తర్వాత లక్ష్మి మరే హిందీ చిత్రంలోనూ నటించక దక్షిణాది భాషల సినిమాలపైనే దృష్టిపెట్టింది. 1977లో విడుదలైన తమిళ సినిమా శిలా నేరంగలిల్ శిలా మణితారగళ్ లో నటనకు జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని అందుకొని ఆ పురస్కారం తమిళ సినిమాకై అందుకొన్న దక్షిణాదికి చెందిన తొలి నటి అయ్యింది.



 1980లలో కథానాయకి పాత్రలు కరువైన తరుణంలో తల్లి పాత్రలు, అమ్మమ్మ పాత్రలలో సహాయనటిగా చేయటం ప్రారంభించింది. జీన్స్ (1998) చిత్రంలో ఐశ్వర్యా రాయ్ బామ్మ గానూ, హల్‌చల్ (2004) లో కరీనా కపూర్ బామ్మగానూ నటించింది. 400కు పైగా సినిమాలు చేసిన లక్ష్మి, రాజకీయాలలో కూడా అడుగుపెట్టింది. ఈవిడ మూడుసార్లు వివాహము చేసుకున్నది. పదిహేడేళ్ళపుడు పెద్దలు కుదిర్చిన సంబంధము ద్వారా భాస్కర్ ను వివాహం చేసుకుంది. ఇతను ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేసేవాడు. ఇతని ద్వారా 1971 లో కుమార్తె ఐశ్వర్య జన్మించింది. తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత తన సహనటుడు మోహన్ ను పెళ్ళి చేసుకుంది. వీరిద్దరూ కూడా త్వరలోనే విడిపోయారు. తర్వాత నటుడు, దర్శకుడు అయిన శివచంద్రన్ ని పెళ్ళాడింది. కన్నడ నటుడు అనంత్ నాగ్ తో కూడా కొద్దికాలం సన్నిహితంగా మెలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: