మనలో చాలా మందికి కూడా ఎండలో తిరగడం, పాదాలపై దుమ్ము, ధూళి, మృతకణాలు పేరుకుపోవడం ఇంకా పాదాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి చాలా కారణాల వల్ల పాదాలు నల్లగా మారతాయి. చాలా మంది పాదాలు నల్లగా ఉండడం వల్ల వారికి నచ్చిన చెప్పులను కూడా ధరించలేకపోతూ ఉంటారు. పాదాలు నల్లగా ఉన్నవారు ఇప్పుడు చెప్పే టిప్స్ పాటించడం వల్ల ఖచ్చితంగా పాదాలు తెల్లగా మారి అవి తిరిగి సాధారణ రంగులోకి వస్తాయి.అలాగే పాదాలపై ఉండే నలుపు, మృతకణాలు తొలగిపోయి పాదాలు చాలా అందంగా తయారవుతాయి.మన ఇంట్లో ఉండే సహజ సిద్దమైన పదార్థాలతో పాదాలను తెల్లగా, అందంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాదాలు నల్లగా ఉన్నవారు ముందుగా వాటిపై ఉండే మురికి ఇంకా మృతకణాలు తొలగిపోయేలా స్క్రబింగ్ చేసుకోవాలి. దీనికోసం మనం పంచదారను, నిమ్మకాయను మీరు ఉపయోగించాల్సి ఉంటుంది. పాదాలను శుభ్రంగా కడిగి గోరు వెచ్చని నీటిలో ఉంచాలి. ఆ తరువాత సగానికి కట్ చేసిన నిమ్మకాయ ముక్కను తీసుకుని దానిపై పంచదారను చల్లి పాదాలపై రుద్దాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు చేసిన తరువాత పాదాలను శుభ్రంగా కడిగి తడి పోయేలా తుడవాలి.
ఆ తరువాత పాదాలకు మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి. ఇంకా అలాగే బటయకు వెళ్లిన ప్రతిసారి సన్ స్క్రీన్ లోషన్ ను రాసుకోవాలి. ఆ తరువాత ఒక టబ్ లో రెండు కప్పుల వేడి నీటిని తీసుకుని అందులో ఒక కప్పు పాలు ఇంకా అలాగే గుప్పెడు గులాబి రేకులు వేసుకోవాలి.ఆ నీటిలో మన పాదాలను ఉంచాలి. ఇలా అరగంట పాటు ఉంచిన తరువాత పాదాలను బయటకు తీసి వాటిని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు చాలా మృదువుగా అవ్వడంతో పాటు పాదాల రంగు కూడా మెరుగుపడుతుంది. ఆ తరువాత పాదాలకు ప్యాక్ ను వేసుకోవాలి. దీని కోసం గిన్నెలో 2 టీ స్పూన్ల శనగపిండిని మీరు తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ కీరదోస రసం, ఒక టీ స్పూన్ టమాట రసం ఇంకా 2 టీ స్పూన్ల నిమ్మరసం వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పాదాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి 5 నిమిషాల పాటు బాగా మర్దనా చేయాలి. దీనిని తడి ఆరే దాకా అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత పాదాలకు మాయిశ్చరైజర్ ని రాసుకోవాలి. ఇక ఇలా తరుచూ చేస్తూ ఉండడం వల్ల చాలా సులభంగా నల్లగా ఉన్న పాదాలు తెల్లగా మారిపోతాయి.