ముఖంపై నల్లటి మచ్చలను తగ్గించే సింపుల్ టిప్స్?

Purushottham Vinay
ముఖంపై నల్లటి మచ్చలను తగ్గించే సింపుల్ టిప్స్?


మొటిమలు వచ్చినప్పుడో లేదా గాయాలు అయినప్పుడో ముఖంపై నల్లటి మచ్చలు వస్తాయి. ఎంత ట్రై చేసినా కూడా ఆ నల్ల మచ్చలు అస్సలు పోవు.అయితే ఇంకా నల్లటి మచ్చలు అలాగే ఉంటున్నాయా? మీ అందాన్ని ఆ మచ్చలు తగ్గిస్తున్నాయా? మరేం టెన్షన్ పడకండి. వంటింట్లో నిత్యం వినియోగించే పదార్థాలనేతో ఆ మచ్చలను చాలా ఈజీగా తొలగించుకోవచ్చు.ఉల్లిపాయ రసం  మచ్చలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఇందుకోసం ఉల్లిపాయ రసాన్ని తీసి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి. కాసేపు అలాగే ఆరనివ్వాలి. ఆ తరువాత గొరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు త్వరలోనే నయమవుతాయి.తేనెతో కూడా మచ్చలు తొలగిపోతాయి. రెండు చెంచాల తేనెలో రెండు చెంచాల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని మచ్చ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి.



 ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. దీనిని ఇలాగే చేస్తే.. రెండు వారాల తరువాత మచ్చలు తగ్గుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది.ఇంకా అలాగే నిమ్మరసంతో అద్భుత ప్రయోజనం ఉంటుంది. నిమ్మరసంతో ముఖంపై ఎలాంటి మరకలు, మచ్చలనైనా పోగొట్టుకోవచ్చు. నిమ్మకాయ సహజమైన బ్లీచ్‌గా పని చేస్తుంది. దాని ఆమ్ల స్వభావం కారణంగా గాయాలు సులభంగా తగ్గుతాయి. అలాగే, గాయాల మచ్చలు కూడా తొలగిపోతాయి. ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ రసాన్ని తీసి, ఆ రసంలో దూదిని ముంచి ముఖంపై ఉన్న మచ్చలపై అప్లై చేయాలి. ఆ మచ్చల మీద దాదాపు 5 నుంచి 10 పాటు మర్దన చేయాలి. ఆ తరువాత కాసేపు ఆరనీయాలి. 30 నిమిషాల తరువాత మంచి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: