చేతులు కలిపిన టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్?

Purushottham Vinay
ప్రస్తుతం ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రయాణిస్తుంది. పర్యావరణానికి అనుకూలంగా కాలుష్యానికి వ్యతిరేకంగా చాలా దేశాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి ఎంతగానో పాటు పడుతున్నాయి. విదేశాల్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి బాగా పెరిపోతుంది. ఇక మన ఇండియాలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల హవా మొదలైంది.దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల వలనే ప్రజల జేబులకు  చిల్లులు పడకుండా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చెయ్యడం వలన పెట్రోల్, డీజిల్ ధర కూడా ఆదా అవుతుంది. దీని కారణంగా వాహనదారులు కూడా ఈవీ వాహనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మరోవైపు టాటా మోటార్స్ ఇంకా అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ చేతులు కలిపాయి. ఎందుకంటే ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అధీకృత డీలర్లకు ఆర్థిక పరిష్కారాలను అందించడానికి టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగస్వామ్యంని కుదుర్చుకుంది. అలాగే దీనికి సంబంధించి ఓ ప్రకటనని కూడా విడుదల చేశారు.


ఇంకా ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ ఇంకా టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం ద్వారా మేము ఎలక్ట్రిక్ వాహనాలను చాలా సులభంగా, మా కస్టమర్ లకు కొనుగోలు ప్రక్రియను చాలా సులభతరం చేయగలమని మేము నమ్ముతున్నాము అని అన్నారు.ఈ ఒప్పందం వలన ఎలక్ట్రిక్ వాహనాల డీలర్లు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ తెలిపింది.ఇంకా అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ ఝా మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ చాలా వేగంగా డెవలప్ చెందుతోందని, అలాగే కస్టమర్ లలో పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ కూడా పెరుగుతోందని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: